హిందూపుర్ పరిపూర్ణం..బాలయ్య ఫ్యాన్స్ గరం!
హిందూపుర్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుండి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుండగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వైసీపీ తరపున మహిళను బరిలో దించారు. ఇక్కడ కూటమి నుండి టికెట్ ఆశీంచిన పరిపూర్ణానందకు నిరాశే ఎదురైంది.
దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్ధి బాలయ్యకు చెమటలు పట్టిస్తున్నారు.
హిందూపురం ప్రజలకు పరిపూర్ణానందం కలగాలని కోరుకుంటున్నా అంటూ ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు అనంత్ శ్రీరామ్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పరిపూర్ణానంద స్వామికి మద్దతు తెలిపినట్లుగా ఆ కామెంట్ ఉండటంతో ఆయనపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. జరుగుతున్న పరిణామాలను చూస్తే ఓటర్లు ఎవరికి మద్దతిస్తారు..?పరిపూర్ణానంద ఓట్లు చీలిస్తే అది ఎవరికి మైనస్ కానుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
The post హిందూపుర్ పరిపూర్ణం..బాలయ్య ఫ్యాన్స్ గరం! appeared first on Adya News Telugu.
READ ON APP