భూములు ఇచ్చేవాడిని లాక్కునే వాడిని కాదు:జగన్
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం జగన్. జగన్ భూములు ఇచ్చేవాడే గాని లాక్కునే వాడు కాదు..దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.
హిందూపురం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు తీరును ఎండగట్టారు జగన్.
ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు. భూములపై ప్రజలకు సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వివరించారు. ఇది పెద్ద సంస్కరణ కాబోతోందని సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి వివాదంలేదని భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం అన్నారు. ఇప్పటికే17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాల్లో సర్వే పూర్తైందని తెలిపారు. కార్డు 2 విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. ఇప్పటి వరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.
The post భూములు ఇచ్చేవాడిని లాక్కునే వాడిని కాదు:జగన్ appeared first on Adya News Telugu.
READ ON APP