ఐపీఎల్కు ధీటుగా ఏపీలో బెట్టింగ్!
దేశవ్యాప్తంగా ఓ వైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక ఐపీఎల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోండగా అటు ఏపీలోనూ అదే స్థాయిలో పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. అభ్యర్థుల గెలుపు/ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది.
గ్రామాలు, మెట్రోపాలిటన్ నగరాలు అనే తేడా లేదు.
ప్రధానంగా అధికార వైసీపీపైనే బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. జగన్ పాలన కావాలా వద్దా అనే అంశంపైనే ఎన్నికలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ మళ్లీ సీఎం అవుతాడా లేదా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేనాని పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా అన్న దానిపై బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందెం కాస్తున్నారు. ఐపీఎల్కు ధీటుగా ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జరుగుతుండటం విశేషం.
The post ఐపీఎల్కు ధీటుగా ఏపీలో బెట్టింగ్! appeared first on Adya News Telugu.
READ ON APP