ఉత్కంఠపోరులో ఢిల్లీ గెలుపు
ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర పోరు జరిగింది. నరాలు తెగేలా జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యచేధనలో గుజరాత్ 8 వికెట్లు కొల్పోయి 220 పరుగులు చేయగా ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారీ లక్ష్యచేధనలో గిల్ 6,అజ్మతుల్లా 1,షారుఖ్ ఖాన్ 8 విఫలమైన వృద్దీమాన్ సాహా 39,సాయి సుదర్శన్ 39 బంతుల్లో 65,డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 3 సిక్స్లు,6 ఫోర్లతో 55 పరుగులు చేశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 224 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (11), ఫ్రేజర్ మెక్గుర్క్ (23) పరుగులకే ఔట్ అయినా తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ (66), రిషబ్ పంత్ (88) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో పంత్ ఆకాశమే హద్దుగా సిక్స్లు, ఫోర్లతో గుజరాత్ బౌలర్లను చీల్చిచెండాడాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ 6వ స్థానంలో, గుజరాత్ 7వ స్థానంలో కొనసాగుతోంది.
The post ఉత్కంఠపోరులో ఢిల్లీ గెలుపు appeared first on Adya News Telugu.
READ ON APP