Fish Eating: ఎండాకాలంలో చేపలు విపరీతంగా తింటున్నారా..తస్మాత్ జాగ్రత్త !
Fish Eating: మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని వైద్య నిపుణులు నిత్యం చెబుతూ ఉంటారు. కాస్త ఆరోగ్యం పైన లైట్ తీసుకుంటే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే మనం ఆరోగ్యంగా ఉండేందుకు మాంసం అలాగే కూరగాయలు విపరీతంగా తింటాం. కూరగాయలు తింటే పర్లేదు కానీ మాంసం తింటే మలబద్ధక సమస్య విపరీతంగా వస్తుంది. చికెన్ కంటే మటన్ ఎక్కువగా తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. మటన్ తింటే ఆరోగ్యంగా ఉంటామని భావనలో ఉన్న చాలామంది జనాలు… మటన్ విపరీతంగా తింటారు. తద్వారా మలబద్ధక సమస్య వస్తుంది. అదే చికెన్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని… కోళ్లకు ఇంజక్షన్స్ వేయడం వల్ల మనకు కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చికెన్ కూడా తినరు. Fish Eating
Also Read: Eating Bread: ఉదయాన్నే బ్రెడ్ తింటున్నారా..? అయితే ఈ ప్రమాదం తప్పదు.!
ఇలాంటి నేపథ్యంలో చేపలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నీటిలో పెరిగే చేపలు తింటే మన ఆరోగ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా చేపలు తినడం వల్ల మనకు ఎలర్జీ అలాగే బద్ధకం లాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మెదడు చురుగ్గా పనిచేస్తుందని వెల్లడిస్తున్నారు. చేపలు ప్రకృతి ఒడిలో పెరుగుతాయి కాబట్టి వీటిని తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. Fish Eating
తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంతేకాకుండా గుండెనొప్పి లేదా బిపి ఉన్నవారు చేపలు తింటే బిపి కంట్రోల్ లో ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చేపలు తింటే మంచిదని తెలుపుతున్నారు. ముఖ్యంగా చేపలు తినడం వల్ల మన ఫేస్ కాస్త గ్లో వస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి చేపలు తినే ప్రయత్నం చేయాలని సూచనలు చేస్తున్నారు. Fish Eating
READ ON APP