Hero Image

AP EDCET 2024 : ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలివే

AP EDCET 2024 : ఏపీ ఎడ్‌సెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈఏడాది ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. 2024 జూన్‌ 8వ తేదీన ప్రవేశపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ ఎడ్‌సెట్‌ 2024 ద్వారా రెండేళ్ల రెగ్యులర్‌ బీఈడీ కోర్సుతో పాటు స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
బీఈడీ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉండాలి. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు కనీసం 37 మార్కుల్ని సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు. ఇక.. దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి వివరాలకు లింక్‌ ఇదే
.. క్లిక్‌ చేయండి.
  • బీఈడీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే వారు బీఏ, బీఎస్సీ, బీఎస్సీ హోమ్‌ సైన్స్, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బీకాం, బీసిఏ, బీబీఎం, బీఈ, బీటెక్‌ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న వారు, కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. అడ్మిషన్ సమయానికి మార్కుల జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది.
  • అలాగే.. దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు కనీసం 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
బీఈ, బీటెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు.. మ్యాథ్స్‌ మెథడాలజీలో ప్రవేశం కోసం కనీసం 55శాతం మార్కుల్ని మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో సాధించాల్సి ఉంటుంది.
  • ఇక.. దరఖాస్తుదారుల వయసు కనీసం 19ఏళ్ల వయసు పూర్తయి ఉండాలి.
  • బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.500, ఓసీ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి.
  • AP EDCET 2024 ప్రవేశ పరీక్ష విధానం: ఏపీ ఎడ్‌సెట్‌ 2024 పరీక్షను ఆబ్జెక్టివ్ తరహా విధానంలో నిర్వహిస్తారు.
    రెండు గంటల వ్యవధిలో 150 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్‌-ఏలో జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులకు ఉంటుంది. పార్ట్‌-బీలో జనరల్ నాలెడ్జ్‌కు 15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు 10 మార్కులుంటాయి. పార్ట్‌ - సీలో ఐదు ఆప్షనల్ సబ్జెక్టులకు 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్స్‌లో 100 మార్కులకు, ఫిజికల్ సైన్స్‌లో ఫిజిక్స్‌కు 50 ప్రశ్నలు, కెమిస్ట్రీకు 50 మార్కులు ఉంటాయి. బయాలజీలో బోటనీకు 50మార్కులు, జువాలజీకి 50 మార్కులు ఉంటాయి. సోషల్ స్టడీస్‌లో జాగ్రఫీకి 35మార్కులు, హిస్టరీకి 30మార్కులు, సివిక్స్‌కు 15మార్కులు, ఎకనామిక్స్‌కు 20 మార్కులు ఉంటాయి.
    ఇంగ్లీష్‌లో 100 మార్కులు ఇంగ్లీష్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ముఖ్యమైన తేదీలివే :
    • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ: ఏప్రిల్‌ 18, 2024
    • దరఖాస్తులకు చివరితేది: మే 15, 2024
    • వెయ్యి రుపాయల ఆలస్య రుసుముతో మే 16 నుంచి 19వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
    • రూ.2వేల ఆలస్య రుసుముతో మే 20,21 తేదీలలో స్వీకరిస్తారు.
    • బీఈడీ ఎంట్రన్స్‌ దరఖాస్తుల్లో తప్పుల్ని సరిచేయడానికి మే 22 నుంచి మే 25వ తేదీ వరకు అనుమతిస్తారు.
    మే 30వ తేదీ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • బీఈడీ ప్రవేశ పరీక్షను జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు.
  • READ ON APP