Hero Image

Neethone Dance: నీతోనే డ్యాన్స్ నుంచి ఆ రెండు జంటలు ఎలిమినేట్.. అమర్-తేజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ సెలబ్రెటీలతో కలిసి చేస్తున్న 'నీతోనే డ్యాన్స్ 2.0' ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. అలనాటి హీరోయిన్ రాధ, సదా, తరుణ్ మాస్టర్ ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న ఈ షో మొత్తం 10 మంది జోడీలతో కొన్ని వారాల ముందు అట్టహాసంగా మొదలైంది. ఇక వారి వారి పెర్ఫామెన్స్‌లను బట్టి వారం వారం ఎలిమినేషన్‌ కార్యక్రమం కూడా సాగుతోంది.
అయితే ఈ వారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. మరి ఏ జంటలు ఎలిమినేట్ అయ్యాయో చూద్దాం. ఆ జోడీలుమనకున్న సమచారం ప్రకారం ఈ వారం శిశిర్- శిరిన్, బాల ఆదిత్య- పూజా మూర్తి జోడీలు ఎలిమినేట్ కాబోతున్నాయి. వీరిలో శిశిర్-శిరిన్ జోడి డ్యాన్స్ బాగానే వేస్తుంది. మరి మిగిలిన జంటలు ఇరగదీయడంతో వీరిని ఎలిమినేట్ చేస్తున్నారేమో చూడాలి. ఇక బాల ఆదిత్య- పూజా మూర్తి కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు. మొత్తానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఈ రెండు జోడీలు వెళ్లిపోతున్నాయన్న మాట.
వైల్డ్ కార్డ్ ఎంట్రీఇక బిగ్‌బాస్ తరహాలో ఈసారి నీతోనే డ్యాన్స్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టారు. ఈ ఆదివారం జరగబోయే ఎపిసోడ్‌లో రెండు కొత్త జంటలు షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇందులో ఒక జంట అమర్‌దీప్-తేజస్విని గౌడ కాగా మరొక జోడీ ముక్కు అవినాష్- అరియానా కావడం విశేషం. ఇందులో అమర్ దీప్- తేజు జోడీ గత సీజన్‌లో పార్టిసిపేట్ చేసింది. ఇద్దరూ డ్యాన్స్ కుమ్మేస్తారన్న సంగతి కూడా తెలిసిందే. కానీ లాస్ట్ సీజన్‌లో ఈ జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక అవినాష్-అరియానా అయితే అంతకుముందు నిర్వహించిన బీబీ జోడీలో జంటగా పార్టిసిపేట్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆ సీజన్‌లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడీ నీతోనే డ్యాన్స్‌లో సందడి చేయబోతుంది.మరి ఈ రెండు జోడీలు మిగిలిన జంటలకి ఎలాంటి పోటీ ఇస్తాయో చూడాలి. పేరుకి డ్యాన్స్ షో అయినప్పటికీ మాములు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం లేదు ఈ షో. ముఖ్యంగా శ్రీముఖి యాంకరింగ్ షోకి బాగా ప్లస్ అవుతుంది. ఇక ఎమోషన్స్, గొడవలు, అరుపులు, కేకల్లో బిగ్‌బాస్‌కి ఏమాత్రం తక్కువ కాదు ఈ షో.
ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు మాస్ మసాలా పెర్ఫామెన్స్‌లతో సమ్మర్ హీట్‌ను కూడా పెంచేస్తున్నారు . మరి ఈ వారం పెర్ఫామెన్సులు ఎలా ఉంటాయో చూడాలి.

READ ON APP