Hero Image

Kamada Ekadashi 2024 కామద ఏకాదశి వేళ ఇలా పూజిస్తే.. శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందట..!

Kamada Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి నెలలో శుక్ల పక్షంలో ఒకటి.. క్రిష్ణ పక్షంలో మరో ఏకాదశి వస్తాయి. ఈ ఏకాదశులలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో ఛైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించి, వ్రతాన్ని ఆచరించే వారికి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పర్వదినాన కొన్ని వస్తువులను సమర్పించడం ద్వారా శ్రీ హరి అనుగ్రహం లభిస్తుందని, భక్తుల కోరికలన్నీ తీరుతాయని మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కామద ఏకాదశి శుభ ముహుర్తం, పూజా విధానం, మంత్రాలు, స్వామి వారికి ఏయే వస్తువులు సమర్పించాలి.. కామద ఏకాదశి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శుభ ముహుర్తం..

ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే కామద ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఛైత్ర శుద్ధ ఏకాదశి తిథి 18 ఏప్రిల్ 2024 సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే 19 ఏప్రిల్ 2024 శుక్రవారం రాత్రి 8:04 గంటలకు ముగుస్తుంది.​Ram Navami 2024 ఆంజనేయుడు లేని ఆ కోదండ రామాలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో...!


పూజా విధానం..

కామద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే నిద్ర లేవాలి. పవిత్ర నదిలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి.అనంతరం విష్ణు మూర్తి విగ్రహం లేదా ఫోటోను శ్రీ యంత్రంతో సహా శుభ్రం చేసి ప్రతిష్టించాలి. నేతి దీపం వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహా విష్ణువును పండ్లు, పువ్వులు, పాలు, నువ్వులు, తులసి ఆకులను, నైవేద్యాలను సమర్పించాలి. తులసి ఆకులు లేకుండా మీ పూజ పూర్తవ్వదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అనంతరం శ్రీ విష్ణుమూర్తి స్తోత్రాలను, మంత్రాలను పఠిస్తూ.. చివరగా హారతి ఇచ్చి పూజ ముగించాలి. ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి నాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి. అనంతరం ఉపవాస వ్రతాన్ని విరమించాలి.


ఏకాదశి ప్రాముఖ్యత..

ఛైత్ర శుద్ధ ఏకాదశిని ‘కామద ఏకాదశి’, ‘సౌమ్య ఏకాదశి’, ‘పాపవిమోచని ఏకాదశి’ ‘దమన ఏకాదశి’ అని అంటారు. ఈ పర్వదినాన శ్రీ హరికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూర్వ కాలంలో దిలీప్ రాజు ఈ ఉపవాస ప్రాముఖ్యతను గురువు వశిష్ట ద్వారా వివరించారు.

పూర్వ కాలంలో పుండరీకుడు అనే రాజు దగ్గర పని చేసే గంధర్వుడు ఉండేవాడు. తను పని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని, తనను రాక్షసుడిగా మారిపోవాలని ఆ రాజు శాపం విధిస్తాడు. దీంతో అప్పటినుంచి గంధర్వుడు రాక్షసుడిగా మారి అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు ఆ గంధర్వుడి భార్య ‘కామద ఏకాదశి’ వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ వ్రత పుణ్యఫలం వల్ల గంధర్వుడు సాధారణ రూపాన్ని పొందుతాడు. అందుకే పవిత్రమైన కామద ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు.


ఉపవాస దీక్ష..

కామద ఏకాదశి రోజున వ్రతం చేసిన స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. వరాహా పురాణంలో శ్రీ క్రిష్ణుడు యుధిష్టరునికి కామద ఏకాదశి విశిష్టతను వివరించారు. ఈరోజున ఉపవాసం ఆచరించడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో వివరించబడింది. ఒకవేళ ఈ పవిత్రమైన రోజున ఏదైనా కారణంతో ఉఫవాస వ్రతం చేయలేకపోతే, ఓ పరిహారం పాటించొచ్చు. స్నానం చేసిన తర్వాత, విష్ణువు లేదా క్రిష్ణుడిని పూజించి రోజంతా సాత్వికంగా ఉండండి.

మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి.


వీటిని తప్పనిసరిగా సమర్పించాలి..!

కామద ఏకాదశి రోజున శ్రీ హరికి అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు జాతకంలో గురు దోషం కూడా తొలగిపోతుంది. అదే విధంగా పసుపు రంగులో ఉండే వస్తువులను సమర్పించాలి. వీటితో పాటు ఖీర్‌ను కూడా విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

READ ON APP