Hero Image

INDIA bloc: దక్షిణాది రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోనున్న బీజేపీ.. ఇండియా కూటమి లీడ్.. సర్వేలో తేలింది నిజమేనా?

INDIA bloc: ఎన్నికలు అంటేనే సర్వేలు సాధారణం. ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలుస్తుంది.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది.. ఏ పార్టీకి అధికారం వస్తుంది అనే విషయాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని కొన్ని సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి. ఎన్నికల సమయంలో చాలా సంస్థలు ఇలాంటి సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎన్నికలకు ముందు, పోలింగ్ తర్వాత ఈ సర్వేలు నిర్వహించి..
ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయి.. ఎన్ని సీట్లు సాధిస్తాయి అనేది వెల్లడిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటములు ప్రధానంగా పోటీలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే దైనిక్ భాస్కర్ అనేపత్రిక ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లో ఇండియా కూటమి లీడ్‌లో ఉందని పేర్కొంటూ మెయిన్ పేజీలో ప్రచురించిన ఓ ఆర్టికల్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఫోటోలో ఏముంది?దైనిక్ భాస్కర్ అనే హిందీ న్యూస్‌ పేపర్‌లో ఏప్రిల్ 13 వ తేదీన ప్రచురించిన ఓ వార్తకు సంబంధించిన
ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. ఈ ఎన్నికల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి లీడ్‌లో ఉందంటూ ఆ వార్త సారాంశం. ఆ న్యూస్ పేపర్‌లోని మొదటి పేజీలో ఆ ఆర్టికల్ ప్రచురితం అయినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు అందులో ఉండటం గమనార్హం. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎన్డీఏ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని దైనిక్ భాస్కర్ న్యూస్ పేపర్ అంచనా వేసినట్లు అందులో పేర్కొన్నట్లు ఉంది.
దైనిక్ భాస్కర్-నెల్సన్ సర్వే నేతృత్వంలో నిర్వహించిన ఓ సర్వేలో ఇండియా కూటమి దేశంలోని 10 రాష్ట్రాల్లో లీడ్‌లో ఉందని ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ 10 రాష్ట్రాల్లోనే ఇండియా కూటమి ఏకంగా 200 స్థానాలు దాటేస్తుందని అంచనా వేశాడు. ఇక హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛరిష్మా.. బీజేపీకి ఓట్లు తెచ్చిపెట్టదని అందులో ఉంది. బీహార్, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నాడు.
అంతేకాకుండా ఈ ఎన్నికల్లో బీజేపీకి 180 కంటే తక్కువ సీట్లు వస్తాయని ఆ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉంది. ఈ ఫోటోను స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్(Spirit Of Congress) అనే ట్విటర్ అకౌంట్ కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో కాంగ్రెస్ నేత లక్ష్మీ నాయర్ కూడా షేర్ చేశారు. అయితే ఇండియా టుడే వెబ్‌సైట్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్‌లో ఇదంతా ఫేక్ అని తేలింది.వెరిఫికేషన్ అండ్ మెథడాలజీదైనిక్ భాస్కర్ పత్రిక ఏప్రిల్ 13 వ తేదీన ప్రచురించిన ఎడిషన్‌లో అలాంటి వార్త ఏదీ ప్రింట్ కాలేదని వెల్లడైంది.
దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ధ్రువీకరించారు. అందులో ఇండియా అనే పదం తప్పుగా రాసినట్లు గుర్తించారు. ఏప్రిల్ 13 వ తేదీన ప్రచురించిన దైనిక్ భాస్కర్ భోపాల్ ఎడిషన్‌ను గుర్తించారు. అయితే ఆ రోజున ఎలాంటి ఎన్నికల సర్వే రిపోర్ట్‌ను ప్రచురించలేదని తేల్చారు. బీజేపీ మేనిఫేస్టో, భోపాల్ వర్షపాతానికి సంబంధించిన వార్తలను ప్రింట్ చేసినట్లు గుర్తించారు. దైనిక్ భాస్కర్ అన్ని ఎడిషన్‌ల మొదటి పేజీలను చెక్ చేసినప్పటికీ ఇలాంటి వార్త ఏదీ ప్రచురించలేదు.
దీంతో అది ఫేక్ అని గుర్తించారు. అంతే కాకుండా దైనిక్ భాస్కర్ వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ను పరిశీలించగా.. ఇలా ఫేక్ వార్త ప్రచారం అవుతుందని దైనిక్ భాస్కర్ మేనేజ్‌మెంట్ పేర్కొనడం గమనార్హం.
దైనిక్ భాస్కర్ ఏదైనా సర్వేను ప్రచురించిందా?నెల్సన్‌తో కలిసి దైనిక్ భాస్కర్ ఎలాంటి ప్రీ పోల్ సర్వేను నిర్వహించలేదు. ఏప్రిల్ 14 వ తేదీన మొదటి సర్వే ఫలితాలను దైనిక్ భాస్కర్..
"మేరా ఓట్ మేరీ మర్జీ" విడుదల చేసింది. 12 రాష్ట్రాల్లోని 308 లోక్‌సభ స్థానాల్లో సర్వే నిర్వహించగా.. అందులో 48 శాతం మంది ఓటర్లు ప్రధానిగా తిరిగి నరేంద్ర మోదీ కావాలని పేర్కొన్నారు. ఇక 37 శాతం మంది పెరుగుతున్న నిరుద్యోగం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ సర్వే 10 రాష్ట్రాల్లో ఇండియా కూటమి లీడ్‌లో ఉందని మాత్రం వెల్లడించలేదు. తీర్పు2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో ఇండియా కూటమి లీడ్‌లో ఉందంటూ దైనిక్ భాస్కర్ పేరుతో వైరల్ అవుతున్న ఫోటో తప్పు అని ధ్రువీకరించడం జరిగింది.(This story was originally fact checked by
INDIA TODAY and translated & edited by Samayam Telugu, as part of the Shakti Collective)

READ ON APP