Hero Image

అతని తొలి గ్యారంటీ నాకే.. మోదీ హామీలపై జశోదాబెన్ ఫోటో వైరల్.. నిజమెంత?

వైరల్ వార్త ఏంటి?ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదా బెన్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీ, జశోదాబెన్ చాలా ఏళ్ల క్రితం నుంచి వేరుగా ఉంటున్నారు. అయితే జశోదాబెన్‌కు సంబంధించిన ఒక ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో జశోదాబెన్ ఒక కాగితాన్ని చూపెడుతూ ఉన్నారు. అందులో అతను తన మొదటి గ్యారెంటీ నాకే ఇచ్చారు.
మిగతాది మీకు తెలిసిందే అంటూ రాసి ఉంది. దీనికి బీజేపీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి అంటూ క్యాప్షన్ ఉంది. అయితే ఈ ఫోటోనూ థ్రెడ్‌లో ఓ యూజర్ షేర్ చేశారు. అలాగే ప్రధాని మోదీ టార్గెట్ చేస్తూ అందులో ఇలా రాసుకొచ్చారు. దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవటానికి వస్తున్నారు.ఓట్లు పొందాలంటే ఉపాధి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి. బీజేపీని తొలగించి దేశాన్ని కాపాడండి.మనకు మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి అవసరం అని రాసుకొచ్చారు.
అసలు నిజమేంటి? అయితే జశోదాబెన్ చేతిలో ఉన్నది మార్ఫింగ్ చేసిన ఫోటో అని ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది. అసలు ఫోటోల జశోదాబెన్ ఒక RTI దరఖాస్తును చేతిలో పట్టుకుని ఉన్నారు. ఎలా తెలిసిందంటే?వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు నవంబర్ 25, 2014న ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో ఉన్న అసలు ఫోటో కనిపించింది. ఈ కథనం ప్రకారం.. నవంబర్ 24, 2014న గుజరాత్‌లోని మెహసానాలోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం బయట జశోదాబెన్ తను దాఖలు చేసిన RTI దరఖాస్తు కాపీని ప్రదర్శిస్తూ ఉన్నారు.మరోవైపు జనవరి 2015లో
హిందూస్తాన్ టైమ్స్ కూడా దీనిపై ఓ కథనం ప్రచురించింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తనకు అందించిన భద్రత వివరాలను కోరుతూ జశోదాబెన్ నవంబర్‌లో మెహసానా పోలీసులకు RTI చట్టం కింద దరఖాస్తు చేశారని అందులో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 24, 2014లో ఎన్డీటీవీ కూడా దీనిపై వీడియో ప్రసారం చేసింది. అందులో సైతం జశోదాబెన్ RTI దరఖాస్తును పట్టుకుని మీడియాతో మాట్లాడుతున్నారు. తీర్పునరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత తనకు కల్పించిన భద్రతా వివరాలను తెలియజేయాలంటూ జశోదాబెన్ 2014 నవంబర్ 24 వ తేదీ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఆ ఫోటోను మీడియాకు ప్రదర్శించారు. అయితే ఆ ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రధాని మోదీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కావున వైరల్ అవుతున్న ఫోటో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా నిర్ధారించాం.(This story was originally Published by news meter and Republished by Samayam telugu as part of Shakti Collective)

READ ON APP