Hero Image

బీజేపీ కండువా కప్పుకున్న స్వామి పరిపూర్ణానంద

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కండువా కప్పి.. పరిపూర్ణానందను సాదరంగా అహ్వానించారు. అంతకుముందు రామ్‌మాధవ్‌.. స్వామీజీని అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్ల మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. తెలంగాణ ఎన్నికల్లో పరిపూర్ణానందను బరిలో నిలుపుతారని, క్యాంపెయిన్ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

READ ON APP